నోటి క్యాన్సర్లో దేశంలోనే రాజస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇది గుట్కా, బీడీ, సిగరెట్, పొగాకు మొదలైన మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది. నోటి లోపల ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం ఉంటే.. అది క్యాన్సర్గా మారే అవకాశం 50 నుంచి 60 శాతం వరకు ఉంటుందని డాక్టర్ ఆశిష్ జోషి తెలిపారు.