3,300 కేజీల డ్రగ్స్ సీజ్.. పాకిస్థాన్ ముఠా అరెస్ట్

59చూసినవారు
3,300 కేజీల డ్రగ్స్ సీజ్.. పాకిస్థాన్ ముఠా అరెస్ట్
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌త్ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టాయి. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్రవ్యాల్ని సీజ్ చేశారు. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటా ఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ పట్టుకుంది. ఐదుగురు పాకిస్థానీల‌ను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్