40% వైకల్యం ఎంబీబీఎస్‌కు అడ్డంకి కాదు.. సుప్రీం కోర్టు తీర్పు

79చూసినవారు
40% వైకల్యం ఎంబీబీఎస్‌కు అడ్డంకి కాదు.. సుప్రీం కోర్టు తీర్పు
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డంకి కాదని తెలిపింది. ఓ వికలాంగుడు ఎలాంటి అడ్డంకి లేకుండా వైద్య విద్య అభ్యసించవచ్చని మెడికల్‌ బోర్డు అభిప్రాయపడిన తర్వాత, అతడు ఎంబీబీఎస్‌లో చేరడానికి సెప్టెంబర్‌ 18న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్