మద్యనిషేధం చేస్తామని.. రూ.41 వేల కోట్లు దారి మళ్లించారు: చంద్రబాబు

61చూసినవారు
మద్యనిషేధం చేస్తామని.. రూ.41 వేల కోట్లు దారి మళ్లించారు: చంద్రబాబు
‘మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌.. పదేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం (ఏఆర్‌ఈటీ) పేరిట రూ.14,275 కోట్లు, వ్యాట్‌ను పక్కన పెట్టేసి స్పెషల్‌ మార్జిన్‌ రూపంలో రూ.26,673 కోట్లు దారి మళ్లించారు. వీటికి జవాబు చెప్పకుండా ఆయన తప్పించుకుంటారా’ అని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్