సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అక్కడి అతిపెద్ద నగరమైన అలెప్పోపై చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్బొల్లాకు చెందిన రాకెట్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని బ్రిటన్ ఆధారిత ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ తెలిపింది. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.