ఆయిల్ ట్యాంకర్​, ట్రక్కు ఢీ.. మంటల్లో చిక్కుకుని 48 మంది మృతి

55చూసినవారు
ఆయిల్ ట్యాంకర్​, ట్రక్కు ఢీ.. మంటల్లో చిక్కుకుని 48 మంది మృతి
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొని 48 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆయిల్ ట్యాంకర్​ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 48 మంది సజీవదహనమయ్యారని నైజీరియా ఎమర్జెన్సీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో ఆయిల్​ ట్యాంకర్​లో ఉన్న 50 పశువులు కూడా చనిపోయాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్