సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.