జ్యువెలరీ షోరూంలో 45 గ్రాముల బంగారు గాజులను కొట్టేసిన మహిళలు (వీడియో)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూంలో ఇద్దరు మహిళలు 45 గ్రాముల బంగారు గాజులను దొంగలించారు. ఈ ఘటన మొత్తం అక్కడి ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. నిందితులను గుర్తించి చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్