గ్రూప్-1 మెయిన్స్‌కు 72.4 శాతం హాజరు

57చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్‌కు 72.4 శాతం హాజరు
తెలంగాణలో తొలి రోజు నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ముగిసింది. ఈ పరీక్షకు 72.4 శాతం మంది హాజరయ్యారు. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వీరిలో 22744 మంది ఇవాళ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్