టీ20 ప్రపంచకప్ జట్టులోకి రింకూ సింగ్కు స్థానం కల్పించకపోవడంపై క్రికెట్ మాజీలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని తలపించేలా అద్భుతమైన ఫినిషింగ్ను ఇవ్వగల సత్తా ఉన్నా ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్న లేవలెత్తుతున్నారు. దీనిపై ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం మనం టీమ్ను ఊహించుకొంటే 11 మందిలో తొలుత అతడి పేరే ఉండేది అని అభిప్రాయపడ్డారు. మరోవైపు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ సైతం సెలక్షన్ సరిగా లేదని పేర్కొన్నారు.