బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్, అతని సోదరీలతో కలిసి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా, ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది.