కేరళ సిపిఎం సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కేవీ రామకృష్ణన్ (74) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఇటీవల పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు. కేవీ రామకృష్ణన్ పాత పాలక్కాడ్ జిల్లా పొన్నాని తాలూకాలోని కుమారనెల్లూరులో 1950 ఏప్రిల్ 8న జన్మించారు.