ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం

63చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం
వరుస ఓటముల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంది. బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి చేర్చుకుంది. అతని కనీస బేస్ ధర రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా గత ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్