భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

68చూసినవారు
భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
శ్రీలంక సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 22 మంది తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నావికాదళం ఆదివారం అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని రామేశ్వరం మత్స్యకారుల సంఘం తెలిపింది. శనివారం వీరంతా సముద్రంలోకి వెళ్లారు. పాల్క్ బే సముద్ర ప్రాంతంలోని నెడుందీవు సమీపంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా, శ్రీలంక నేవీ అధికారులు వారిని అరెస్ట్ చేసినట్లు మత్స్యకారుల సంఘం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్