తమిళనాడులోని కళ్లకురుచిలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతిచెందగా ఈ ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ఘటనలో 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్ధితి విషమంగా ఉందని అన్నారు. మృతులలో అధికులు షెడ్యూల్డ్ కులాల వారేనని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.