పార్క్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం కలకలం

83చూసినవారు
పార్క్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం కలకలం
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం కలకలం రేపింది. మృతుడు లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్‌గా అధికారులు గుర్తించారు. కారులోనే ధ్రువ్ నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్