టీ20 సమరం మొదలైంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 9న జరిగే భారత్-పాకిస్తాన్ పోరుపైనే ఉంది. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ రెండు జట్లు తలపడతున్నాయంటే అందరి దృష్టి మ్యాచ్ పైనే ఉండటంతో.. ఒత్తిడి ఇరు జట్లపైన ఉంటుంది. కానీ మేము ఏకగ్రాతను కోల్పోకుండా ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నిస్తామని బాబర్ పేర్కొన్నాడు.