గంజాయికి అలవాటు పడి ఇతరులకు కూడా అమ్ముతున్న కొడుకును ఓ తల్లి పోలీసులకు పట్టించింది. చెన్నైలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న శ్రీరామ్ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతని ఫ్రెండ్ అరుణ్తో కలిసి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా సప్లైయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లి భాగ్యలక్ష్మీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.