బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్యులు అద్వానీకి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. కాగా, గత నెల 26వ తేదీన కూడా అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.