కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు.. కాపాడిన పోలీస్ (వీడియో)

68చూసినవారు
కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ రైలు కింద పడబోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ సదరు ప్రయాణికుడిని సురక్షితంగా కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని వాపి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కానిస్టేబుల్ యోగేష్ జగుభాయ్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడటంతో ప్రజలు అతడిని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్