ఐపీఎల్లో రాజస్థాన్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ అన్క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో పరాగ్ ఈ ఘనత సాధించాడు. అలాగే, ఈ సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ (2018), ఇషాన్ కిషన్ (2020), యశస్వి జైస్వాల్ (2023) ఒక సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు.