ఇండిగో విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. యవనిక అనే మహిళ బెంగళూరు నుంచి భోపాల్కి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తనకు కేటాయించిన సీటు కింది భాగంలో కుషనింగ్ లేకపోవడంతో ఆమె షాక్ అయ్యారు. వెంటనే ఫొటో తీసి తాను సేఫ్గా ల్యాండ్ అవుతానా? అంటూ ఇండిగోకి ట్వీట్టర్లో ఫిర్యాదు చేశారు. కాగా క్లీనింగ్ సమయంలో సీటు కుషన్ తీశామని ఇండిగో వివరణ ఇచ్చింది.