తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్ (34) బుధవారం ఉదయం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు మహేష్ హైదరాబాద్ నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి జార్జియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.