వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు చాలానే జరుగుతుంటాయి. ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరా అవుతుండడంతో పశువులతో పాటు ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు సరైన వైరింగ్ లేక.. డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో పలువురు షాక్తో చనిపోతుంటారు.