ఉత్తరప్రదేశ్ హత్రాస్ విషాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు. న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగంగా ఉంటారని తెలిపారు. ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.