యూపీలోని షాజహాన్పూర్ జిల్లా ఖుతార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దాబా వద్ద ఆగి ఉన్న బస్సును డంపర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. వీరంతా ఉత్తరాఖండ్లోని పూర్ణంగిరిలో మాత ఆస్థానానికి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.