ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నివారీ ప్రాంతంలోని గంగానహర్లోని ఓ బైకర్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న తల్లీకొడుకు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.