జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ తాత్కాలిక స్థావరంపై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ ప్రత్యేక పోలీస్ అధికారి గాయపడ్డారు. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. ఇక క్షతగాత్రులైన సైనికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఉగ్రదాడిని తామే చేశామని 'కశ్మీర్ టైగర్స్' ఉగ్రసంస్థ ప్రకటించింది. గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగాయి.