దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. సూరజ్ అనే వ్యక్తికి కబీర్నగర్లో ట్యాప్స్, పెయింట్స్ షాపు ఉంది. రోజు మాదిరి బుధవారం కూడా అతడు షాపు తెరిచి లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సూరజ్ వెనకాలే వచ్చిన దుండగుడు.. అతడిపై గన్తో 4 రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.