ఎదురెదురుగా ఢీకొన్న టూరిస్ట్‌ వ్యాన్-కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

79చూసినవారు
ఎదురెదురుగా ఢీకొన్న టూరిస్ట్‌ వ్యాన్-కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపూర్‌ జిల్లాలోని మతుకళం సమీపంలో బుధవారం టూరిస్ట్‌ వ్యాన్‌, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్ట్‌ వ్యాన్‌లో ఉన్న 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మడతుకులం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్