కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ

52చూసినవారు
కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ
కల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఇటీవల ఫాతిమా ఖాతూన్(31) అనే మహిళ తన భర్తతో కలిసి ప్రయాణించింది. ప్రయాణం మధ్యలో ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్ కు వెళ్ళింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెళ్లి చూడగా ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది.

సంబంధిత పోస్ట్