మహారాష్ట్రలోని బోరివలి రైల్వేస్టేషన్లో ప్రమాదం తప్పింది. ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె రైలు కింద పడబోగా గమనించిన కానిస్టేబుల్ వెంటనే ఆమెను కాపాడారు. దీంతో సదరు మహిళ ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా చూసిన నెటిజన్లు రైల్వే పోలీస్ను ప్రశంసిస్తున్నారు.