AP: వచ్చే నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలకు నిలిపి వేస్తున్నట్లు ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని పేర్కొంది. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని, ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చించినా ఫలితం లేకుండా పోయిందంది. తమ సామర్థ్యానికి మించి సేవలు అందించామని, ఇకపై కొనసాగించలేమని నోటీసులు పంపింది.