ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బీజేపీలో చేరారు. కేజ్రీవాల్ క్యాబినెట్లో ఆనంద్ గతంలో మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ను ED అరెస్ట్ చేశాక, ఆయన AAPని విడిచిపెట్టారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. పార్టీలో దళిత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.