బాలికపై హత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు మరణశిక్ష విధించింది. రాజస్థాన్లోని భిల్లారా జిల్లాలో పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టులో ఓ బాలిక(14)పై అత్యాచారం చేసి అనంతరం ఆమెను సజీవదహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు సోదరులకు సోమవారం మరణశిక్ష విధించింది. అలాగే మరో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయమూర్తి అనిల్ గుప్తా ఈ తీర్పు వెలువరించారు.