ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఓ బ్యూటీ పార్లర్లో వధువును మాజీ ప్రేమికుడు కాల్చి చంపిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్లో ఓ లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ మేరకు యువతిని చంపి పరారైన దీపక్ ఆగ్రా నుంచి ధర్మశాలకు చేరుకున్నాడు. అక్కడ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అతడి జాడ కనుక్కున్న పోలీసులు అక్కడికి వెళ్ళి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో దీపక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.