చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి

6429చూసినవారు
చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
మద్యం మత్తులో కింద పడి రిమ్స్ లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన పొట్ల దేవీదాస్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసగా మారడంతో గురువారం మద్యం సేవించి బస్టౌండ్ లో కిందపడిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ దేవీదాస్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్