సెకండరీ గ్రేడ్ టీచర్(SGT) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ నంబర్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామని తెలిపింది.