ఆ గ్రామం తరలింపు.. ఎందుకంటే

9795చూసినవారు
ఆ గ్రామం తరలింపు.. ఎందుకంటే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న 18 గ్రామాలను అటవీ శాఖ గుర్తించింది. వారిని అక్కడి నుంచి తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల తరలింపుకు సర్వం సిద్ధం చేశారు. ఐదారేళ్లుగా కొత్త మద్దిపడగలో గ్రామాల ప్రజలకు కాలనీ నిర్మించారు. సోమవారం నుంచి ఆ గ్రామాన్ని తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్