లోక్సభ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దంతెవాడలో మొత్తం 26 మంది నక్సలైట్లు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. లొంగిపోయిన వారిలో 'జోగా ముచకి' అనే మావోయిస్టుపై రూ.లక్ష బహుమతి ఉందని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. 26 మంది వ్యక్తుల్లో ఐదుగురు మహిళలతో పాటు ఇద్దరు బాలికలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.