కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన హరీశ్ అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన హరీశ్ తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. గురువారం రాత్రి పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వైద్యం కోసం మంచిర్యాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్గాం ఎస్ఐ రామన్ కుమార్ తెలిపారు.