ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్టెల్ కూడా టారిఫ్లపై 11-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. జూలై 3 నుంచి పెంపు వర్తించనుంది.