ఉత్తరప్రదేశ్లోని బీజేపీలో విభేదాలు నెలకొనడంపై సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరోసారి స్పందించారు. ‘మాన్సూన్ ఆఫర్: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటుచేయండి’ అంటూ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ను ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ యూనిట్లో అంతర్గతపోరు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరని ఆరోపించారు.