ఆప్‌ మంత్రి అతిషిని పరామర్శించిన అఖిలేష్‌

79చూసినవారు
ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్‌ మంత్రి అతిషిని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిన ఆమెను బుధవారం ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషికి ప్రజల కోసం ఎలా పోరాడాలో కూడా తెలుసని, ఢిల్లీ సమస్యల పరిష్కారం కోసం ఆమె నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్