అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం

78చూసినవారు
అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కర్హల్ అసెంబ్లీ సీటుకు ఆయన రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన యూపీలోని కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఈ విషయాన్ని తాజాగా అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా, 'ఇండియా' కూటమి భాగస్వామిగా సమాజ్‌వాదీ పార్టీ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాలను కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్