రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే కార్యరంగంలోకి దిగి తమకు తోచిన రీతిలో సేవ చేస్తున్నారు. మరికొందరైతే సృజనాత్మకతను జోడించి అయోధ్య రామాలయం వద్ద మార్వెల్, డీసీ కామిక్స్ కు చెందిన సూపర్ హీరోలు సేవ చేస్తున్నట్లు ఏఐ ఫోటోలు రూపొందించారు. సాహిద్ ఎస్కే అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. అవి ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.