కూటమిదే గెలుపు: గంటా

566చూసినవారు
కూటమిదే గెలుపు: గంటా
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే గెలుపని సర్వేలు చెబుతున్నాయని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. మరోవైపు ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. జూన్‌ 4 తర్వాత వైకాపా పని అయిపోతుందని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్