తెలంగాణలో ఇప్పటికే 14 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక నేడు మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై కాంగ్రెస్ గతకొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది. నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం అనంతరం దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్ లోని నోవాటెల్ లో ఈ మీటింగ్ జరగనుంది.