TG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి నూతన ఛైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఛైర్మన్ పై 10మంది కాంగ్రెస్కి చెందిన డైరెక్టర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. వారికి మరో ఐదుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చారు.