మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణాపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇటీవల ఆమె ఎంపీ ఒవైసీ సోదరులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జి రాకేశ్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా ‘వారికి 15 నిమిషాలేమో.. పోలీసులు తప్పుకుంటే అదే తమకు 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.